సైదాబాద్ లో చిన్నారిని రేప్ చేసి దారుణంగా హత్య చేసిన రాజు అనే నిందితుడి కోసం పెద్ద ఎత్తున గాలింపు జరుపుతున్నారు పోలీసులు. అతని కోసం పది లక్షల రివార్డ్ కూడా ప్రకటించారు. పట్టించి ఇచ్చిన వ్యక్తికి పది లక్షల నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించడం దాన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేయడం మనం చూస్తున్నాం. సినిమా హీరోలు కూడా దీనిపై ఎక్కువగా స్పందిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చిన్నారి కుటుంబాన్ని పరామర్శించడానికి  సినిమా నటులు రాజకీయ నాయకులు వెళ్తున్నారు. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. జూబ్లిహిల్స్ లో జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఆయన వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన కార్యకర్తలు అలాగే నాయకులు పాల్గొంటారు. గ్రేటర్ కమిటీ సభ్యులు అలాగే కీలక నేతలు వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: