ఆర్టీసి ఎండీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సజ్జనార్ మార్పులకు శ్రీకారం చుడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇక తాజాగా పుష్పక్ బస్సులో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్... బస్సులో ఉన్న వాళ్ళతో మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ పుష్పక్  బస్సులో  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుండి పంజాగుట్ట వరకు ప్రయాణించారు ఆయన.


బస్సులో ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు , కర్ణాటక ప్రయాణికులతో మమేకమై ఎయిర్ పోర్ట్ టీఎస్ ఆర్టీసీ కల్పిస్తున్న రవాణా సౌకర్యాల పై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు సజ్జనార్. ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి వారి విలువైన సలహాలు స్వీకరించారు ఆయన. ఆయా రాష్ట్రాల ప్రజా రవాణా వ్యవస్థ పనితీరు గురించి అక్కడ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు అని ఆర్టీసి వర్గాలు తెలిపాయి.  ఇటీవల ఆయన ఇదే తరహాలో పలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: