రోజు రోజుకు క‌రోనా  కేసులు పెరుగుతున్న త‌రుణంలో తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా  శ‌నివారం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని నెట్టింట్లో వైర‌ల్ అయింది. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఆదివారంతో (ఈరోజు) ముగియ‌నున్నాయి. రేపటి నుంచి అనగా సోమవారం నుంచి పలు పాఠశాలలు కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరుణ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో మరికొద్ది రోజులు సెలవు ప్రకటించాలని ప్రభుత్వం వాటిని నిజం చేస్తూ ఈనెల 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవు తొలగిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు.

మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 20వ తేదీ వరకు కరోణ‌ ఆంక్షలను తొలగించిన తరుణంలో విద్యాసంస్థలకు సెలవులను పొడగించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించింది. దీంతో జనవరి 30వ తేదీ వరకు సెలవులను ప్రకటిస్తున్నట్టు సోమేష్  కుమార్  వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ సూచనలపై సీఎం కేసీఆర్ తో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యాసంస్థలు మొత్తం ఈ నెల 30వ తేదీ వరకు మూతపడనున్నాయి మరోవైపు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు లేదా అనే విషయంపై త్వ‌ర‌లో ఓ క్లారిటీ రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: