ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విజయవాడ వస్తున్నారు. ఇవాళ విజయవాడలో కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం జగన్ పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. జాతీయ రహదారుల సంస్థ  20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. వీటితో పాటు మరో 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ భూమిపూజ చేస్తారు.


విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొననున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 1.55కి బెంజ్‌ సర్కిల్‌ చేరుకోనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్..  కొత్తగా నిర్మించిన పైవంతెనను ప్రారంభిస్తారు.  ఆ తర్వాత తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అక్కడే సీఎంతో పాటు మధ్యాహ్న భోజనం చేయనున్నట్టు సమాచారం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: