విశాఖ మణిహారంలో మరో మణిపూస చేరబోతోంది. హరేకృష్ణ సంస్ధ విశాఖలో అద్భుత వైకుంఠం పేరిట శ్రీనివాస గోవింద, శ్రీ రాధా కృష్ణుల భవ్య మందిరం నిర్మాణం చేయబోతోంది. దీనికి ఇటీవల భూమి పూజ నిర్వహించింది. గంభీరం గ్రామంలో, ఐఐఎం సమీపంలో ఈ నిర్మాణం రాబోతోంది. ఈ భూమి పూజ కార్యక్రమంలో గీతాపారాయణం గురుపూజ, హరినామ సంకీర్తన హరినామ జపయజ్ఞం, శృంగారహారతి, భూవరాహయజ్ఞం, పూర్ణాహుతి, భూమిపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఇండియా ప్రతినిధి మధు పండిట్ దాస్, సత్య గౌర చంద్ర దాస, నిష్క్రించిన భక్తదాస ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందిర స్థల దాత డాక్టర్  ఎస్.వీ. ఆదినారాయణ, డాక్టర్ శశి ప్రభ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివీస్ లాబ్స్  అధినేత మధుసూదన్ రావు దంపతులు సహా 108 దాతల కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ మందిరం కేవలం ఒక దేవాలయం, ప్రార్ధనా మందిరంగానే కాకుండా సమాజ వికాసానికి కేంద్రంగా ఉంటుందని హరే కృష్ణ మూవ్‌మెంట్ ఇండియా ప్రతినిధి మధు పండిట్ దాస్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: