వైవీ సుబ్బారెడ్డి.. ఈయన మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు.. అంటే ప్రస్తుత సీఎం జగన్‌ కు సొంత బాబాయి. జగన్‌కు చాలా ఆప్తుడు.. అందుకే ఆయనకు పార్టీలో కీలక స్థానం ఉంటుంది. అంతకుముందు నుంచి వైవీ సుబ్బారెడ్డికి జగన్ మంచి ప్రయారిటీ ఇచ్చేవారు. అయితే ఇదే వైవీ సుబ్బారెడ్డి గతంలో జగన్‌ అక్రమాస్తుల కేసుల్లోనూ నిందితుడుగా ఉన్నారు. ఆ కేసుల విచారణ ఇంకా సాగుతూనే ఉంది.


అయితే.. తనకు ఏ పాపం తెలియదని.. కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడల్లుడిని అయినందువల్లే ఇందూ-హౌసింగ్‌ బోర్డు ఒప్పందాలకు సంబంధించిన అవకతవకల కేసులో ఇరికించారని తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. తనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ జరిపారు.
వాదనల తర్వాత కేసు తదుపరి విచారణ సెప్టెంబరు 8కి వాయిదా పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: