ఈనాడు పత్రిక కథనాలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రుషికొండ నిర్మాణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండపై ప్రభుత్వం నిర్మాణాలు చేస్తుంది వాస్తవమేనన్న ఆయన.. ప్రభుత్వ నిర్మాణాలతో మీకొచ్చే నష్టమేంటని ప్రశ్నించారు.  ఈనాడు రామోజీరావుకు ఒళ్లు పోతరమని.. రాష్ట్రంపైన, సీఎం వైయస్‌ జగన్‌పైన రామోజీరావుకు  అక్కసని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.


ఉత్తరాంధ్రపై వారికి ఎంత అక్కసుందో ప్రజలు తెలుసుకోవాలని... ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని.. మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎంత కండకావరంతో ఎన్ని రాసుకున్నా..దేవుడు మావైపు ఉంటారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  రుషికొండలో ఇంతకు ముందు టూరిస్ట్‌ గెస్ట్‌హౌస్‌ ఉండేదని... మళ్లీ టూరిజం అక్కడ భవనాలు నిర్మిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏంటి.. తప్పెంటి? నిర్మాణాలు చేయకూడదా.. నామ్స్‌ అన్నీ ఆ శాఖ చూసుకుంటుంది కదా..  మేం ప్రైవేట్‌ వాళ్లకు లీజుకు ఇవ్వలేదు కదా అంటూ నిలదీిశారు. మంత్రి బొత్స సత్యనారాయణ.


మరింత సమాచారం తెలుసుకోండి: