రంగారెడ్డి జిల్లాలో హెచ్ఎండీఏ మరోసారి భూములు వేలం వేయబోతోంది. వేలం వేయనున్న భూములకు సంబంధించి నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి వందకు పైగా ఔత్సాహికులు, పలు స్థిరాస్థి సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 13 ల్యాండ్ పార్సెల్ అమ్మకానికి హెచ్ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి  హైదరాబాద్ లో ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు. 


అమ్మకానికి ఉంచిన భూములు, వాటి వివరాలు, ప్రాధాన్యతను హెచ్ఎండీఏ అధికారులు వారికి వివరించారు. సమావేశానికి హాజరైన పలువురు భూములు, వాటి వివరాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ తమ సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. భూములు కొనే ఆసక్తి కలిగిన వారు ఈ నెల 16వ తేదీ వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని హెచ్ఎండీఏ  అధికారులు తెలిపారు.  17న ధరావత్తు చెల్లించాలని  భూముల అమ్మకం కోసం 18వ తేదీన ఈ-వేలం నిర్వహిస్తామని హెచ్ఎండీఏ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: