కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన  తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసిందని చిరంజీవి అన్నారు. ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యానని... ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటని చిరంజీవి అన్నారు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు.

 
కె.విశ్వనాథ్ గారితో చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పొచ్చు. ఆయన్ను చిరంజీవి సొంత కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. ఎప్పటికప్పుడు కె.విశ్వనాథ్ దంపతులను చిరంజీవి కలుస్తూనే ఉంటారు. ఇటీవలే తన భార్య సురేఖతో కలిసి కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆయన ఆశ్వీర్వాదం కూడా తీసుకున్నారు. చిరుకు నటనకు సంబంధించి ఎన్నో మెలుకవులు నేర్పించిన గురువు కె విశ్వనాథ్. చిరంజీవి, కె.విశ్వనాథ్‌ కలిసి 'శుభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు' వంటి సినిమాలు సినిమాలు రూపొందించారు. ఈ సినిమాలన్నీ మ్యూజికల్ గా సూపర్ హిట్స్ గా నిలిచాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: