తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ల ప్రచార పర్వం ఆఖరి రోజు కి చేరుకుంది. తెలంగాణ లోని దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం తో ఎదురులేని టీ ఆర్ ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచు. గత రెండు ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తున్నా టీ ఆర్ ఎస్ పార్టీ ని బీజేపీ అలవోకగా నిలువరించింది. కేసీఆర్ కూడా ఇంతటి విజయాన్ని ఊహించలేదని చెప్పాలి. తొలి సారి కంటే రెండో సారి అనూహ్యమైన మెజారిటీ తో గెలిచింది టీ ఆర్ ఎస్ పార్టీ.. అయితే గత కొన్ని నెలలుగా కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు ప్రతిపక్షాలకు కాదు ప్రజలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి..