సైరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు..కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కి నోచుకుంది.. చిరు కి కూడా కరోనా సోకడంతో కొన్ని రోజులు ఈ సినిమా వాయిదా పడింది. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ఆ మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. తొలిసారి కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్ ని కాదని మణిశర్మ తో ఈ సినిమా చేస్తున్నాడు.