నేడు ప్రశాంత్ నీల్, ప్రభాస్ ల సలార్ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకుని ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమా చేయడం విశేషం.. చూడబోతే ఈ నాలుగు సినిమాలు ప్రభాస్ కెరీర్ ని ఎక్కడికో తీసుకుపోతాయని చెప్పొచ్చు. రాధే శ్యామ్ తప్పా మిగితా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే..ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా.. ఇందులో రాధే శ్యామ్ సినిమా ముందుగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. వేసవి కానీ వచ్చే దసరా కి కానీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.