తొలి సినిమా నేను శైలజ తో టాలీవుడ్ కి పరిచయమైనా కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ లాంటి సినిమా తో బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టి టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.. ఎప్పుడైతే మహానటి సినిమా చేసిందో ఆమె స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయిందనుకున్నారు.. మహానటి సినిమా తో కీర్తి సురేష్ కి దేశమంతటా మంచి పేరు తో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.. అయితే ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు మినిమం హీరోయిన్ గా కూడా నిలబెట్టుకోలేకేపోయాయి..స్టార్ హీరో లతో చేసే ఛాన్స్ ఉన్నప్పుడు వారితో చేయకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమా లు చేయడం ఆమెకు పెద్ద మైనస్ గా మారాయని చెప్పొచ్చు.. అయితే ఆ సినిమా కూడా పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమెకు మరింత మైనస్ గా మారాయి..