లాక్డౌన్ కారణంగా ఆచార్య బాగా ఆలస్యం కావడం వల్ల ముందుగా అనుకున్న బడ్జెట్ ఇప్పుడు భారంగా మారింది. తన స్నేహితుడి నిర్మాణంలో ఈ చిత్రం చేస్తోన్న కొరటాల శివ పెరిగిన బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని చరణ్ క్యారెక్టర్ లెంగ్త్ పెంచితే తప్ప బడ్జెట్ వర్కవుట్ కాదంటూ చెప్పి మెగా హీరోలను లాక్ చేసాడట.ఈ లాక్ డౌన్ అదీ లేనట్టయితే ఈ ప్రపోజల్కు రాజమౌళి అభ్యంతరం చెప్పి వుండేవాడేమో కానీ ఇప్పుడు తన సినిమా మరీ ఆలస్యం అవుతుండడం వల్ల అటు నుంచి కూడా పెద్దగా ఆక్షేపణలుండవు. అందుకే చరణ్ పాత్ర గురించి ఇంతకాలం మౌనంగా వున్న కొరటాల శివ ఇప్పుడా పాత్ర నిడివి గురించి ఓపెన్ అయిపోయాడు. అయితే ఆచార్య ముందు రిలీజ్ అయిన పక్షంలో ఈ తరంలోని అతి పెద్ద మల్టీస్టారర్గా ఆర్.ఆర్.ఆర్.కి వున్న క్రేజ్ ఏమైనా ఎఫెక్ట్ కావచ్చునేమో తెలీదు.