మెగా హీరో గా ఇంస్ట్రీ లోకి వచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్.. మొదట్లో ఆటుపోట్లు తిన్నా ఇప్పుడు వరుస హిట్లతో పాటు సినిమాల ఎంపిక లోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.. వరుసగా 9 సినిమాల ఫ్లాప్ ల తర్వాత చిత్ర లహరి సినిమా తో తన ఫ్లాప్ ల పరంపరకు బ్రేక్ వేశాడు.. ఒకరకంగా ఈ సినిమా తేజు కు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది అని చెప్పుకోవాలి.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సైతం సక్సెస్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ కావడంతో యూత్ ఈ సినిమా కి బాగ్ కనెక్ట్ అయ్యింది.. వరుసగా అన్ని ఫ్లాప్ లు అనేసరికి తేజ్ చాలా కృంగిపోయాడని అప్పట్లో మెగా కాంపౌండ్ వాపోయింది.