మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన..  ఎంతో అట్టహాసం గా ప్రారంభమైన ఈ సినిమా కి బ్యాడ్ లక్ అని చెప్పాలి..  ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు.. మెగా మేనల్లుడు నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు.. మధ్యలో ఎన్ని OTT ఆఫర్ లు వచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు..