చారిత్రక సినిమాలు.. సీరియల్స్ తెరకెక్కించే టప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కథ, కథనాలు మార్చకుండా.. వాటిని వక్రీకరించకుండా ఈ నాటి ప్రజలకు కనెక్ట్ అయ్యేలా చెప్పడం కత్తిమీద సాము అయితే అదే టైంలో ఇలాంటి కథలు తెరకెక్కించేటప్పుడు ఆర్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. నాటి కాలానికి తగ్గట్టుగా ఆర్ట్ వర్క్ లేకపోతే కథ, కథనాల్లో ఎంత బలం ఉన్నా అది తేలిపోతుంది.. ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు.
తాజాగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమానులు ఒక ఎపిసోడ్లో కాఫీ కప్ని, మరో ఎపిసోడ్లో స్టీల్ ఫ్లాస్క్ని గుర్తించి ట్రోల్ చేశారు. తాజాగా మహాభారతం సీరియల్లో భీష్మ పితామహ పక్కన కూలర్ ఉండడాన్ని పసిగట్టేశారు. దీంతో వాళ్లు ఇప్పటి కలియుగంలోనే కాదు.... నాటి ద్వాపర యుగంలో 20వ శతాబ్ధబ్దపు నాటి కూలర్ ఉందా ? లేదా ఏసీలు కూడా ఉన్నాయా ? అంటూ సెటైరికల్గా ట్వీట్స్ చేస్తున్నారు.
భీష్మ పితామహకి ఉక్క పోస్తుందేమో అందుకని ఆయన సింహాసనం పక్కన కూలర్ ఉంచారంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఎవరికి వారు రకరకాలుగా స్పందిస్తూ జోకులు వేసుకుంటున్నారు. పాపం అలా భీష్ముడికి ఉక్కపోత సెటైర్లు తప్పడం లేదు.