వికారాబాద్ జిల్లాలో మరోసారి గుప్త నిధులు బయటపడ్డాయి. జిల్లాలోని పరిగి మండలం సుల్తానాబజార్ లో గుప్తనిధులు బయటపడటం జిల్లాలో కలకలం రేపింది. పొలం తవ్వకాల్లో బంగారు, వెండి ఆభరణాల చెంబులు బయటపడ్డాయి. దీందో జిల్లావ్యాప్తంగా గుప్తనిధుల గురించి ప్రచారం జరిగింది. విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. పొలం యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుపుతున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు తరువాత పోలీసులు మీడియాకు వివరాలను తెలియజేసే అవకాశం ఉంది. జిల్లాలో గుప్తనిధులు బయటపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో గుప్త నిధులు బయటపడ్డాయి. పోలీసులు, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు దొరికిన వస్తువులను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: