ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసి అందరి విద్యార్థులను పాస్ చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్  పరీక్షల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. 

 


 అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. అసెస్మెంట్ మార్కుల ప్రతిపాదికన విద్యార్థులకు గ్రేడ్ నిర్ణయించామని తెలంగాణ విద్యా శాఖ తెలిపింది. విద్యార్థులందరూ WWW.bse.telangana.govt.in లో వివరాలు చూసుకోవచ్చు అంటూ తెలిపారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: