హైదరాబాద్ సరూర్ నగర్ పిఎన్జీ  కాలనీ లో రాత్రి దారుణ హత్య జరిగింది. గౌలిగూడ కు చెందిన రౌడీషీటర్ వినయ్ పై పాత నేరస్థులు  కత్తితో దాడికి దిగారు. అయితే ఈ హత్యకు డబ్బులు  సెల్ఫోన్ విషయంలో జరిగిన వివాదమే కారణమని తెలుస్తోంది. 

 


 అయితే ఈ ఘటన ఒక్కసారిగా స్థానికులను  తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సంతోష్ నగర్ కు చెందిన అన్నదమ్ములు సందీప్ సంతోష్ కుమార్ లు ఈ హత్య చేసి ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు

మరింత సమాచారం తెలుసుకోండి: