విశాఖలో జరిగిన మరో గ్యాస్ లీక్ ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. సాయినార్ కంపెనీలో ఈ ప్రమాదం  చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ కంపెనీలో మృతుల కుటుంబాలకుకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని సీపీఐ నేత రామకృష్ణ తాజాగా డిమాండ్ చేసారు. 

 

ఇద్దరు మృతి చెందడం, మరో ఐదుగురు అస్వస్థతకు గురవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం, ఆర్థిక సహాయం అందించాలని అధికారులను కోరారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ నిల్వలున్న పరిశ్రమలన్నింటినీ తనిఖీ చెయ్యాలని ఆయన సూచించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: