కరోనా దెబ్బతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా సోకితే చిన్న పిల్లలు, వృద్ధులే కాదు... ఖరీదైన ఆరోగ్యం చేయించుకునే స్థోమత ఉన్న సెలబ్రిటీల పిల్లలు సైతం దీనికి బలికాక తప్పడం లేదు. తాజాగా కరోనా దెబ్బతో కేంద్ర మాజీ మంత్రి బేణి ప్రసాద్ వర్మ కుమారుడు దినేష్ (40) మరణించారు. లక్నో నగరానికి చెందిన దినేష్ కు గత కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వచ్చింది.
స్థానికంగా వైద్యం చేయించినా పరిస్థితి కంట్రోల్లోకి రాకపోవడంతో దినేష్ ను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దినేష్ మరణించారు. సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడైన బేణిప్రసాద్ వర్మ ఈ ఏడాది మార్చి 27వతేదీన మరణించారు. బేణిప్రసాద్ వర్మ గతంలో యూపీఏ -2 ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు.