బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత చిత్రపరిశ్రమలో నేపోటిసమ్ అనే ఒక వాదన తెరమీదకు వచ్చిన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో ఎంతగానో బంధుప్రీతి ఉంది అంటూ ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా బిజెపి ఎంపీ బెంగాల్కు చెందిన ప్రముఖ నటి రూపా గంగూలీ కూడా దీనిపై స్పందిస్తూ.. కొందరు వ్యక్తుల వల్ల సినీ పరిశ్రమలో బంధుప్రీతి తారా స్థాయికి చేరిందని.. అన్ని రంగాల్లోనూ ఇది ఉందని... తనకు అలాంటిది నచ్చదు అంటూ చెప్పుకొచ్చింది. బంధుప్రీతి ని ప్రదర్శించేవారీ సినిమాలు చూడడం ఎప్పుడో మానేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ. నేపోటిసం కారణంగా ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంట్ ఉన్న యువ నటులు కనబడకుండా పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు రూపా గంగూలీ .