అయితే తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చి చూసే సరికి రక్తస్రావం కనిపించింది. అదిచూసి ఆమె తల్లి కూతురును నిలదీసింది. దానికి ఆ బాలిక కడుపు నొప్పి అని చెప్పింది. అపెండిసైటిస్తో బాధపడుతుందేమోనని అంబులెన్సుకు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. తీరా ఆ బాలికను పరీక్షించిన వైద్యులు చిన్నారి డెలివరీ అయ్యినట్టు తెలిపారు. దానితో అసలు విషయం తల్లిదండ్రులు చెప్పేసింది. తాను జన్మనిచ్చిన నవజాత శిశువును ఫ్రీజరులో ఉంచానని చెప్పింది. వెంటనే అక్కడకు వెళ్లిచూడగా ఆ శిశువు మరణించి ఉంది. అయితే బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి