విజ‌య‌వాడ‌లో లాక్‌డౌన్‌పై అఫీషీయ‌ల్‌గా వ్యాపార‌స్తుల నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. దీంతో విజ‌య‌వాడ వ్యాపారాల నిమిత్తం వెళ్లే వారంద‌రు ఈ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు దృష్టిలో పెట్టుకుని వెళ్లాల్సి ఉంది. కరోనా ఉధృతంగా వ్యాపిస్తున్న కారణంగా కరోనా కట్టడిలో భాగంగా బెజవాడలోని అన్ని వ్యాపార ,వాణిజ్య సంస్దలు యాజమాన్యాలు కలిసి  చర్చించుకుని వ్యాపార లావాదేవీలకై  స్వచ్చందంగా  నిర్దిష్టమైన సమయాలను నిర్ణయించారు.

ఆదివారం ఒక్కరోజు  మాత్రమే కృష్ణా జిల్లా, విజయవాడ వ్యాపారం బంద్ అవుతుంది. సోమవారం నుంచి ఉదయం 9 గంటల నుండీ సాయంత్రం 6 గంటల వరకే వ్యాపార సమయాలుగా ఉంటాయి. రాబోయే వారం నుంచి శనివారం, ఆదివారం కూడా బంద్ పాటిస్తారు. ఇక రేపు 18/04/2021 ఆదివారం విజయవాడ లోని అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక సోమ‌వారం నుంచి ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు షాపులు మూసివేయాలని వ్యాపార వాణిజ్య సంస్థలు నిర్ణ‌యం తీసుకున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: