రఘురామ కేసు స్పెషల్ మూవ్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు రఘురామ కోర్టుకు తెలిజేశారట. ఈ విషయాన్ని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే రిమాండ్ రిజెక్ట్ చేయాలని న్యాయస్థానానికి విన్నివించామన్నారు న్యాయవాది లక్ష్మీనారాయణ. అయితే వీటిపై ఇంకా ఆర్డర్లు రావాల్సి ఉందని లాయర్ లక్ష్మీనారాయణ తెలిపారు. మరోవైపు..రఘురామరాజు కాలి దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌. ఈ క్రమంలోనే రఘురామకు కేంద్రం కల్పించిన వై కేటగిరి భద్రత కొనసాగించాలని ఆయన తరపు న్యాయవాది సీనియర్ లాయర్ ఆదినారాయణరావు కోరారు. అంతేకాదు రఘురామ కుటుంబ సభ్యులను కూడా అనుమతించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: