నాగర్ కర్నూల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం గేట్లు తెరవడంతో చూడడానికి గురువారం పటాన్ చెరువు కు చెందిన నరేష్, సుచిత్ర కు చెందిన వంశీకృష్ణ, నిజాంపేట్ వెంకటేష్, బొల్లారం కు చెందిన కార్తీక్ విహార యాత్రకు బయలుదేరారు. శ్రీశైలం డ్యాం చూసి తిరిగి వస్తున్న వారికి నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం గేటు వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు అతి వేగంగా ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు చనిపోయారు. వంశీకృష్ణ, వెంకటేష్, కార్తీక్ మృతి చెందగా నరేష్ బయటపడ్డాడు.

ఇక మరో కారులో ఉన్నవారు ఆనంద్ బాగ్ ప్రాంతానికి చెందిన శివకుమార్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. వారిలో శివకుమార్, మూర్తి, సుబ్బలక్ష్మి తో పాటు ఓ చిన్నారి కూడా కన్నుమూసింది. ఈ మొత్తం ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన వేగంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా రోడ్డు మధ్యలో డివైడర్స్ లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు పోలీసులు మృతదేహాన్ని అప్పగించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: