ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా న‌టించిన ‘పుష్ప’ సినిమాకు అన్నిచోట్లా డివైడ్ టాక్ వినిపిస్తున్న‌ది.  వసూళ్ళ పరంగా తొలి రోజు దద్దరిల్లినా సాంకేతికంగా బాగా ఇబ్బంది పెట్టింది అని టాక్ వినిపిస్తోంది.  నిర్మాతల లెక్కల ప్రకారం దాదాపు రూ.180 కోట్లతో భారీ బ‌డ్జెట్‌తో  తీసిన సినిమా ఇది. నిజానికి ఇంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా క్వాలిటీ పరంగా అదరహో అనిపించేలా ఉండాలి కానీ.. సుకుమార్ తీసిన సినిమాలు సాంకేతికంగా అద్భుతంగానే  ఉంటాయి. ‘వన్’ నేనొక్కడినే, ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ ఆర్య‌వంటి సినిమాలు ఇందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌లు.

రంగ‌స్థ‌లం త‌రువాత సుకుమార్.. అలా వైకుంఠ‌పురంలో త‌రువాత అల్లుఅర్జున్.. ఇలా వీరిద్ధ‌రి కాంబేష‌న్‌లో ఈ చిత్రం రావ‌డంతో.. అభిమానులు భారీ అంచెనాలు పెట్టుకున్నారు. విడుద‌ల‌కు ముందే కొన్ని చోట్ల ప్రీమియ‌ర్ షోల‌కు అనుమ‌తి కూడా ఇచ్చారు. అయితే తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌శ్చిమగోదావ‌రి జిల్లాలో పుష్ప సినిమాకు టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ల‌భించింది. పెరిగిన టికెట్ ధ‌ర‌ల‌తు తాజాగా బుకింగ్‌ను ప్రారంభించారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో అన్నీ చోట్ల పుష్ప సినిమాకు డిసెంబ‌ర్ 17 నుంచి 30 వ‌ర‌కు సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచిన విష‌యం విధిత‌మే. అయితే  ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ₹250, ₹200, ₹120 & ₹70 ధ‌ర‌లు ఉండ‌నున్నాయి. స్థానిక అధికారులు అనుమతిస్తే హైకోర్టు రేట్లను పెంచవచ్చు. ఇది కేవ‌లం  వ్యక్తిగత జిల్లా జాయింట్ కలెక్టర్ వరకు అమ‌లులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: