అయితే ఇప్పటికే చాలా దేశాలు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కేసుల తీవ్రత మరింత పెరుగుతుండటంతో.. మళ్లీ మాస్క్ తప్పనిసరిగ్గా ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని.. ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా పలు కార్యక్రమాలపై ఆయా ప్రభుత్వాలు ఆంక్షలు కూడా విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్ సందర్బంగా ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉండడంతో.. లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఒమిక్రాన్ కట్టడిలో నిర్వహిస్తున్న లాక్డౌన్ ఇవాల్టి నుంచి జనవరి రెండవ వారం వరకు అమలులో ఉంటుందని ఆదేశ ప్రధాని మార్క్ రూట్ వెల్లడించారు. ఈ సమయంలో నిత్యావసరాలు, అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వనుండగా.. ఇతర దుకాణాలు, బార్లు, జిమ్లు, క్షౌరశాలలు, బహిరంగంగా జరిగే కార్యక్రమాలన్నింటిని నెదర్లాండ్ ప్రభుత్వం బంద్ చేయనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి