ఉక్రెయిన్ పై యుద్ధంలో పౌర నివాసాలు సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఉక్రెయిన్ కూడా బలంగానే ఎదురు దాడి చేస్తోంది. తాజాగా రష్యా ఆధీనంలో ఉన్న నోవా కఖోవా ప్రాంతంలోని ఆయుధ కేంద్రంపై ఉక్రెయిన్ రాకెట్ దాడి జరిపింది. ఈ దాడితో ఆ ప్రాంతంలో భారీ విస్ఫోటనం  సంభవించింది.

అయితే.. అమెరికా అందజేసిన హిమ్రాస్ రాకెట్ లతో ఉక్రెయిన్ ఈ దాడి జరిపినట్టు తెలుస్తోంది. రష్యాకు చెందిన టాస్ న్యూస్ ఏజన్సీ మాత్రం భిన్నమైన కథానం చెబుతోంది.  ఎరువుల గోదాముపై దాడి జరిగిందని అంటోంది. దాని వల్ల పేలుడు సంభవించిందని.. సమీపంలోని మార్కెట్ , ఆసుపత్రి, గృహాలు దెబ్బతిన్నాయని రష్యా తెలిపింది. ఆ ఎరువుల్లోని కొన్ని పదార్థాలను పేలుడు సామాగ్రి కోసం వినియోగిస్తారని రష్యా వివరించింది. ఉక్రెయిన్ మాత్రం  రష్యా ఆక్రమిత ప్రాంతంలోని మైకోలైవ్ పై కూడా తాము దాడి చేసినట్లు చెప్పుకుంటోంది. ఈ దాడిలో  రెండు ఆసుపత్రులు, నివాస ప్రాంతాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ చెబుతోంది. తమ ఈ దాడిలో నలుగురు గాయపడినట్లు ఉక్రెయిన్ మైకోలైవ్ గవర్నర్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: