శ్రీశ్రీశ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో నృసింహ దీక్షలు ఈ నెల 25 ప్రారంభిస్తామని దేవస్థాన అధికారులు ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25 న నృసింహ దీక్షలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఆలయ వర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం అధికారికంగా ఈ నెల 25న దీక్షలు ప్రారంభిస్తుందని దేవస్థానం సహాయక కార్యనిర్వాహణాధికారి ఆనంద్ కుమార్ వివరించారు.

ఈ దీక్షల విరమణ జనవరి 5 న ఉంటుందని.. అదే రోజు ఘనంగా శాంతి కల్యాణం కూడా నిర్వహిస్తామన్నారు. నృసింహ దీక్షలు ధరించే భక్తులందరికీ ఉచితంగా తులసిమాలలు అందజేస్తామన్నారు.  ఆలయ స్థానాచార్యులు, ఇతర అర్చక వర్గాలు ఆదేశాల మేరకు శాస్త్రోప్తంగా నృసింహ దీక్షలు ప్రారంభిస్తామన్నారు. దేవస్ధానం నిర్ణయించిన ప్రకారం కొండపైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: