కేసీఆర్ ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పదవులు అనుభవించిన కేసీఆర్‌కు 40ఏళ్ల నుంచి గుర్తు రాని అమ్మగారి ఊరు కేసీఆర్ కు ఇవాళ గుర్తొచ్చిందా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏనాడైనా ఈ ప్రాంత ప్రజల కోసం, అభివృద్ధి కోసం కృషి చేశాడా.. కామారెడ్డి రైతుల భూములు గుంజుకునేందుకే కేసీఆర్ ఇక్కడికి వచ్చిండు.. రాష్ట్రంలో రైతుల వడ్లు రూ.2వేలకు కొనేవాడు లేడు.. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండిన వడ్లను క్వింటాకు రూ.4250 కి కావేరీ సీడ్స్ కు అమ్ముకుండు.. ఇది నిజం కాదని రాజరాజేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


కామారెడ్డిపై దండయాత్ర చేసిన కేసీఆర్ ను బండకేసి కొట్టేందుకే అధిష్టానం నన్ను ఇక్కడ పోటీలో దింపిందన్న రేవంత్ రెడ్డి.. మీ పంట పొలాలను కబలించడానికి వస్తున్న కేసీఆర్, అతని బంధుగణం నుంచి భూములను కాపాడే బాధ్యత నాదని అన్నారు. బీఆరెస్ ను కేసీఆర్ ఊరు అని చెప్పుకుంటున్న కొనాపూర్ లొనే బొంద పెడదామని.. ధర్మం వైపు ఉంటారా.. అధర్మం వైపు ఉంటారా ఆలోచించండని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దొరల రాజ్యం పోయి ప్రజా పాలన రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: