తెలుగుదేశం - జనసేన పొత్తు సూపర్ హిట్ అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయనగరంలో నిర్వహించిన లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలు కంటి నిండా నిద్రపోవాలంటే, వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావాలన్న చంద్రబాబు.. త్వరలో అమరావతి, తిరుపతిల్లో భారీ బహిరంగ సభలు త్వరలోనే నిర్వహిస్తామన్నారు. రెండు సభల్లో ఏదో ఒక చోట ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని.. ఇక జగన్ పని అయిపోయిందని.. రేపు జరిగే కురుక్షేత్రం లో వైకాపా ఓటమి ఖాయమని చంద్రబాబు అన్నారు.


తెలుగుదేశం - జనసేన పొత్తుతో వైకాపా అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతేనని.. మునిగిపోతున్న వైకాపా త్వరలోనే అంతమవ్వటం ఖాయమని.. వచ్చే 5ఏళ్లలో ఎక్కడా లేని అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటామని చంద్రబాబు అన్నారు. రాజకీయాలకు ఏమాత్రం పనికిరాని అనర్హుడు జగన్మోహన్ అన్న చంద్రబాబు.. వైకాపా పెద్దలు తప్పు చేయమంటే, చేసేసిన అధికారుల్ని వదిలి పెట్టబోమన్నారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడి, తెలుగుదేశం జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని.. ప్రతీ ఒక్కరూ ఓటర్ లిస్టు సరిచూసుకోవాలని చంద్రబాబు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: