సంచలనాలను తన చిరునామాగా మార్చుకున్న రిలయన్స్ జియో మరో సంచలన ఆఫర్ను ప్రకటించింది. ‘ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్’ పేరుతో రూ. 399 అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ట్రిపుల్ క్యాష్బ్యాక్ ఆఫర్లో మైజియో, జియో.కామ్ సైటు ద్వారా రూ.399 లేదా ఆపై మొత్తాలతో రీఛార్జ్ చేసుకున్న సబ్స్క్రైబర్లకు రూ.400 క్యాష్బ్యాక్ను జియో అందించనుంది.
రూ.50తో కూడిన ఎనిమిది వోచర్ల రూపంలో ఈ మొత్తాన్ని ఆఫర్ చేయనుంది. తర్వాత రీఛార్జ్ ప్యాక్ను కొనుగోలు చేసిన ప్రతిసారీ ఈ వోచర్లను వాడుకుంటూ రూ.50ను తక్కువ చేసుకోవచ్చు. డిజిటల్ వాలెట్ల నుంచి రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు ఈ క్యాష్బ్యాక్లు అందనున్నాయి. . తర్వాత రీచార్జ్ చేసుకునే సమయంలో ప్రతీసారి ఓ కూపన్ను వినియోగించుకోవచ్చు.
జియో భాగస్వామ్య మొబైల్ వాలెట్లు అయిన అమెజాన్ పే, యాక్సిస్ పే, ఫ్రీచార్జ్, మొబిక్విక్, పేటీఎం, ఫోన్పే వాలెట్లలో రూ. 300 విలువైన వోచర్లు క్రెడిట్ అవుతాయి. అంతేకాక జియో ప్రైమ్ మెంబర్లు ఈ-కామర్స్ సైట్లలో షాపింగ్ చేస్తే రూ. 1,899 విలువైన ఓచర్లు లభిస్తాయి. ఫ్లైట్ టికెట్ల బుకింగ్పై డిస్కౌంట్ కూడా లభిస్తుంది. నేటి నుంచి ఈనెల 25 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 15వ తేదీ నుంచి క్యాష్ బ్యాక్ ఓచర్లు కస్టమర్ల ఖాతాలో జమ అవుతాయి.