టెక్నాలజి అనేది ఈరోజుల్లో చాలా త్వరగా అప్డేట్ అవుతుంది.ప్రతి దానిలో కొత్త కొత్త ఫీచర్స్ తోటి అభివృద్ధి చెందుతుంది. అయితే రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ ఒక తీపి కబురు అందించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ను మరింత కొత్తగా మార్చి ప్రయాణికుల ముందుకు తీసుకురాబోతోంది.అంటే అంతకముందు 2018 లో వెబ్ సైట్ ను సరి కొత్త ఫీచర్స్ తోటి అప్డేట్ చేసింది. దీనితో ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుకింగ్ను మరింత సులభతరం అవుతుందని అధికారులు వెల్లడించారు.
ఆర్టిఫీషియల్ఇంటెలిజెన్స్ సాయంతో వెబ్సైట్ను పూర్తిగా అప్డేట్ చేస్తున్నామని ఇండియన్ రైల్వేస్ బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ఇప్పుడు అప్ డేట్ చేసిన వెబ్ సైట్ లో హోటల్ బుకింగ్స్, మీల్స్ బుకింగ్ వంటి వాటిని కూడా ఇంటిగ్రేడ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఇలా కొత్తగా హోటల్ బుకింగ్స్ కూడా అప్ డేట్ చేయడం వల్ల ప్రయాణికులకు కొంత సమయము ఆదా అవుతుంది. అన్ని ఒకేసారి బుక్ చేసుకునేలా సౌకర్యాన్ని ఇచ్చింది. అంటే ఒకేసారి గమ్యాన్ని చేరడానికి ట్రైన్ టికెట్, ఉండడానికి హోటల్ బుకింగ్, తినడానికి తిండి అన్ని ఒకేసారి వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఆగస్ట్ నెలలో కొత్తగా అప్గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ వెబ్సైట్ ప్రయాణికుల ముందుకు వస్తుందని తెలిపారు.
కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రయాణికులు సులభంగానే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ట్రైన్లను సులభంగానే సెర్చ్ చేయొచ్చని, అన్ని ట్రైన్లలో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు సులభంగానే తెలుసుకోవచ్చని, వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. కాగా మరోవైపు ఇండియన్ రైల్వేస్ ఇస్రోతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని ద్వారా ట్రైన్ ఎక్కడ ఉందో కచ్చితంగా తెలుసుకోవచ్చు. అంటే మన ఫోన్ లోనే మనం గమ్యాన్ని చేరవలిసిన రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు అన్నమాట..