శుభవార్త. ఇవాళ బులియన్ మార్కెట్లో వెండి ధ‌ర భారీగా త‌గ్గింది. ఒక కిలో వెండి పై రూ.800 వరకూ ధర తగ్గింది. కిలో వెండి ఢిల్లీలో రూ. 66,800గా ఉంది. ఇక ఇదే కిలో వెండి ముంబైలోనూ రూ. 66,800గానే ఉంది. అదే కిలో వెండి చెన్నైలో అయితే.. రూ.71,300గా ఉంది. హైదరాబాద్‌లోనూ రూ. 71,300గానే ఉంది. విజయవాడలోనూ రూ. 71,300గానే ఉంది. విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 71,300 గానే కొన‌సాగుతోంది.


ఇక బంగారం ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో చూద్దాం.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా ఉంటే..  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. ముంబయి, కోల్‌కతా, బెంగళూరులోనూ ఇవే ధరలు ఉన్నాయి.  చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,920గా ఉంటే..  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,280గా ఉంది.  


పూణెలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.47,700గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,030గా ఉంది. ఇక మన హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650గా ఉంటే..  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.


ఇక బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉంటుంచాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి, వెండి ధరల్లో మార్పులు ఇందుకు కారణం కావచ్చు. అలాగే..  ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు కూడా ధరల్లో మార్పులకు కారణం అవుతాయి. దేశంలోని జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు.. ఇలా ఎన్నో అంశాలు బంగారం, వెండి రేట్లపై అధికంగా ప్రభావం చూపుతుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: