రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిసినా.. మన మార్కెట్లు నిలకడగా ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు మిశ్రంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ స్వల్ప నష్టాలతో ట్రేడవుతుండగా.. చైనా మార్కెట్ల నష్టాలు అధికంగా ఉన్నాయి. హాంగ్సెంగ్ అరశాతంపైగా లాభాలతో ట్రేడవుతున్నా.. పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయి. డాలర్తో రూపాయి భారీగా క్షీణించడంతో నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది.డాలర్ మారకంలో రూపాయి పతనం సోమవారం కూడా కొనసాగింది.
ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 12 పైసలు పతనమై, 68.12 పైసలు వద్ద ముగిసింది. గత శుక్రవారం రూపాయి ఒకేరోజు 30 పైసలు పతనమైన సంగతి తెలిసిందే. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గత మంగళవారం రూపాయి విలువ 16 నెలల కనిష్టస్థాయి 68.15 స్థాయికి చేరింది. అయితే బుధ, గురు వారాల్లో తిరిగి కొంత బలపడుతూ 67.70 స్థాయికి చేరింది.అంతర్జాతీయంగా డాలర్లకు డిమాండ్, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, దేశంలో కరెంట్ అకౌంట్ లోటు పెరుగుదల భయాలు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణాల్లో కొన్ని.
డాలర్ పెరుగుదల వల్ల ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిఫ్టి ప్రధాన షేర్లలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా ముందున్నాయి. అలాగే నష్టపోయిన నిఫ్టి షేర్లలో అల్ట్రాటెక్ సిమెంట్ ముందుంది. ఈ షేర్ ఒకటిన్నర శాతం నష్టపోయింది. భారతీ ఎయిల్టెల్, హీరో మోటో కార్ప్, హిందాల్కో, జీ ఎంటర్టైన్ మెంట్ కూడా ఒక శాతంపైగా నష్టపోయాయి. ఇక బీఎస్ఇలో జస్ట్ డయల్ 5 శాతం దాకా లాభంతో ట్రేడవుతోంది.