తన పిల్లలకు ఏ చిన్న కష్టం వచ్చిన తల్లి తట్టు కోలేదు. చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లి పోతుంటుంది. ఏదైనా కష్టం వచ్చింది అంటే చాలు ప్రాణాలకు తెగించి తన పిల్లలను కాపాడు కుంటుంది తల్లి. అలాంటిది ఏకంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు తల్లి కళ్ళముందే చనిపోతే.. ఆ తల్లి గుండె ఒక్కసారిగా బద్దలయి పోతోంది. ఆ బాధ వర్ణనాతీతం. ఇక్కడ ఓ మాతృ మూర్తికి ఇలాంటి కడుపు కోతే మిగిలింది. అప్పటివరకు అంతా సంతోషం గానే గడిచింది. కానీ అంతలో వారి ఆనందాన్ని చూసి వీధి ఓర్వ లేక పోయింది.


 చివరికి  తల్లి కళ్ళ ముందే కూతురు చని పోయే పరిస్థితి తీసుకు వచ్చింది. ఈ విషాదకర ఘటన తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు లోకి వచ్చింది. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటన లో ఓ చిన్నారి దుర్మరణం చెందింది. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లో సుమన్ విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఇక అతనికి భార్య స్వరూప కూతురు ఆద్యా ఉన్నారు. ఇటీవల డ్యూటీ నిమిత్తం సుమన్ మూడు రోజులపాటు అంతర్వేదికి వెళ్ళాడు. ఇటీవలే భార్యను కూడా అక్కడికి తీసుకెళ్లేందుకు వచ్చాడు


 ముగ్గురు కలిసి బైక్పై ప్రయాణం అవుతున్నారు. కానీ ఇంతలో విధి వారిని చూసి ఓర్వ లేక  పోయింది. రాజ నగరం చేరుకునే సమయంలో అతివేగంగా వస్తున్న వ్యాన్ వెనుక నుంచి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలోనే బైక్ పై ఉన్న అందరూ ఒక వైపు పడిపోగా ఇక చిన్నారి ఆద్య మాత్రం చక్రాల కింద పడిపోయింది. వ్యాన్  ఆ చిన్నారి పైనుంచి వెళ్లడం తో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కళ్ళెదుటే అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోవడాన్ని చూసిన తల్లి అరణ్యరోదనగా విలపించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: