సినిమాలలో భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని ,అన్యోన్యతను, ప్రేమానురాగాలను చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇంత అద్భుతమైన జీవితం ఉంటుందా అని నేటి రోజుల్లో పెళ్ళీడుకొచ్చిన యువతీ యువకులు అనుకుంటూ ఉన్నారు. దీంతో తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే నిజజీవితంలో భార్యా భర్తల మధ్య తలెత్తుతున్న గొడవలు కారణంగా జరుగుతున్న దారుణ ఘటనలు చూసిన తరువాత మాత్రం పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తలు చిన్నచిన్న కారణాలకే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్న పరిస్థితులు వస్తున్నాయి.


 మొన్నటికి మొన్న చికెన్ కూర వండలేదు అనే కారణంతో కట్టుకున్న భార్యను భర్త దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక నిన్నటికి నిన్న బ్రష్ చేయకుండా లిప్ కిస్ ఇవ్వ లేదు అన్న చిన్న కారణంతో కష్టసుఖాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేసిన భర్త దారుణంగా హత్య చేసిన ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకో బోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించి అనే చెప్పాలి. ఇంటి తలుపులు ఆలస్యంగా తెరిచింది అన్న కారణంతో చివరికి భార్యను దారుణంగా హతమార్చాడు భర్త.


 అందరినీ విస్మయానికి గురి చేస్తున్న ఈ దారుణ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.  కొప్పళ జిల్లా గంగావతి కి చెందిన మంజుల మొదటి భర్తను వదిలి రాము అనే వ్యక్తిని పెళ్లాడింది. కామాక్షి వాడలో నివాసముంటుంది సదరు మహిళ. ఇక పారిశ్రామికవాడలో కూలి పనులు చేస్తూ ఉండేది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవలే విధుల నుంచి రాము ఇంటికి వచ్చాడు. కాగా మంజుల మాత్రం ఆలస్యంగా తలుపు తీసింది. అంతేకాకుండా భర్తకు  అన్నం కూడా పెట్టలేదు. దీంతో కోపంతో ఊగిపోయాడు భర్త. చివరికి భార్యను దారుణంగా నరికేశాడు. శవాన్ని  సూట్కేసులో పెట్టుకొని తుముకూరు మార్గంలో వదిలేసి చెన్నైకి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: