ఇటీవల కాలం లో మానవ బంధాలకు కాస్తైన విలువ ఇవ్వని మనిషి అడవుల్లో ఉండే జంతువుల కంటే దారుణం గా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాలి. ఏకంగా అభం శుభం తెలియని వారి విషయం లో కామం తో ఊగిపోతున్న మనిషి దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇటీవల కాలం లో ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి.


 వెరసి రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గడం లేదు. ఇక్కడ సభ్య సమాజం తలదించుకునే మరో ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రులతో కలిసి గుడిసెలో పడుకున్నా రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేశాడు ఇక్కడ ఒక మానవ మృగం. అయితే ఇలా చిన్నారిపై అత్యాచారం చేసింది ఎవరో కాదు తండ్రి స్నేహితుడే కావడం గమనార్ధం. ఈ ఘటన ఇండోర్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. తల్లిదండ్రులతో నిద్రిస్తున్న రెండేళ్ల చిన్నారిని తండ్రి స్నేహితుడు అర్ధరాత్రి సమయంలో కిడ్నాప్ చేశాడు.


 ఆ తర్వాత ఒక ట్రక్కులో ఏకంగా మూడు కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి అక్కడే అత్యాచారం చేసి రోడ్డుమీద వదిలేసి పారిపోయాడు. రోడ్డుమీద చిన్నారి రక్తం కారుతున్న సమయంలో ఏడుస్తూ కనిపించేసరికి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆసుపత్రికి తరలించిగా చిన్నారి తీవ్రంగా గాయపడిందని రక్తం బాగా పొందని ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు  చివరికి నిందితుడు పితాంపూర్ వైపు పారిపోయెందుకు ప్రయత్నించుగా అరెస్టు చేశారు పోలీసులు. అతని భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అందులో పదేళ్ల కూతురు కూడా ఉండడం గమనార్హం. ఇక తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విషయం గురించి తెలిసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: