ప్రేమ అనేది నేటి రోజుల్లో ప్రాణం పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రేమించిన పాపానికి ఎంతో మంది దారుణ హత్యలకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు పెళ్లి విషయంలో కూడా తాము చెప్పిందే వినాలి అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల ప్రేమను ఎక్కడ అంగీకరించడం లేదు. వెరసి  ఎన్నో దారుణాలు జరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది అని చెప్పాలి.



 ఏకంగా సొంత మరదలిని ప్రేమించడమే ఆ యువకుడి పాలిట శాపంగా మారింది. కూతురుని ఇచ్చి పెళ్లి చేయాల్సిన మామ ఆ యువకుడి ప్రాణం తీసేసాడు. గూడెం గ్రామానికి చెందిన అనిల్ తన మేనమామ కూతురుని ప్రేమించాడు. అమ్మాయి కూడా అనిల్ ని ఇష్టపడింది అని చెప్పాలి. కానీ ప్రతి లవ్ స్టోరీ లో  విలన్ ఉన్నట్లుగానే.. వీరి కథలో ఏకంగా యువతి తండ్రి విలన్ గా మారిపోయాడు. తన కూతురిని ప్రేమిస్తుంది మేనల్లుడే కదా అని అనుకోకుండా అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని చంపేయాలని పథకం వేసాడు.



 ఈ క్రమంలోనే యువకుడితో మాట్లాడే పని ఉంది అని చెప్పిన మేనమామ లక్షెట్టిపేట మున్సిపాలిటీ శివారులోకి తీసుకువెళ్లాడు. ఇక తను ముందుగానే బీరులో గడ్డి మందు కలిపి సిద్ధంగా ఉంచుకున్నాడు. ఇక అల్లుడు తన దగ్గరికి రాగానే కత్తితో బెదిరించి మరీ బీర్ తాగించాడు. తర్వాత అనిల్ అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. మేనమామ అక్కడి నుంచి జారుకున్నాడు. స్థానికులు గమనించి అతన్ని ఆసుపత్రిలో చేర్పించగా.. ఇక చికిత్స తీసుకుంటూ కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. కానీ చివరికి ప్రాణాలు కోల్పోయాడు అనిల్. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: