ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఎంతోమంది దారుణంగా అత్యాచారాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఒంటరిగా ఉన్న ఆడపిల్లలకే రక్షణ లేదు అని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో పక్కన కుటుంబ సభ్యులు ఉన్న వారిపై దాడి చేసి మరి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అని చెప్పాలి.



 వెరసి ఇలాంటి తరహా ఘటనలు ఇక ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఒక విదేశీ యువతికి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ఇండియాలో సమాజ సేవ చేయడానికి వచ్చిన విదేశీ యువతి చివరికి ఒక ఆకతాయి లైంగిక వేధింపులకు గురైంది. ఏకంగా దేశం యొక్క పరువు తీసే విధంగా అతిథితో ఆ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. జర్మనీకి చెందిన 20 ఏళ్ల యువతి ఇండియా సంస్కృతి సాంప్రదాయాలను వచ్చి సమాజ సేవ చేసేందుకు తమిళనాడుకు వచ్చి అక్కడే ఉంటుంది.



 విలుపూరం జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటూ స్థానిక ప్రజలతో మమేకం అయ్యి  తోచిన సహాయం చేస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈ విదేశీ యువతి స్నేహితురాలని కలిసేందుకు పుదుచ్చేరిలోనే ప్రైవేట్ బస్సు ఎక్కి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరింది. అయితే బస్సులో ఆమె ఒంటరిగా కనిపించడంతో నీచానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. అర్థరాత్రి సమయంలో ఆమె నిద్రపోతుండగా దగ్గరికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అతను చేష్టలతో మెలుకువ వచ్చిన  విదేశీ యువతీ కేకలు వేయడంతో బస్సులు నిలిపివేశారు. అయితే జరిగిన విషయం గురించి బస్సులో తోటి ప్రయాణికులకు చెప్తే వాళ్ళు లైట్ తీసుకొని యువకుడిని  మందు నుంచి బస్సు దింపేశారు. కానీ బెంగళూరు నుంచి తమిళనాడు తిరిగి వచ్చిన యువతి  పోలీసులకు ఫిర్యాదు చేయగా..  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: