కావాల్సిన ప‌దార్థాలు: 
దొండకాయలు- అర‌కిలో
ఆవపిండి- 200 గ్రాములు
కారం- 200 గ్రాములు

 

ఉప్పు- 200 గ్రాములు
నువ్వల నూనె- స‌రిప‌డా
పసుపు- ఒక టీ స్పూన్‌

 

ఇంగువ - చిటికెడు
మెంతిపిండి - రెండు టీ స్పూన్లు
చింతపండు - 100 గ్రాములు

 

త‌యారీ విధానం: ముందుగా దొండకాయల్ని నీళ్ల‌లో శుభ్రంగా కడిగి త‌డి ఆరబెట్టుకోవాలి. ఆరిన తరువాత కాయలకి చిన్న పుల్లతో గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నూనెపోసి అందులో ఈ దొండకాయల్ని వేసి స్టౌమీద పెట్టాలి. ఈ గిన్నెపై మరో వెడల్పాటి గిన్నెపెట్టి అందులో నీళ్లు పోయాలి. ఇప్పుడు దీన్ని చిన్నమంటపై మగ్గనిచ్చి.. కాయలు మెత్తపడ్డాక స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి. 

 

ఉడికిన దొండకాయలపై చింత‌పండు వేసి బాగా కలిపి ఆవపిండిలో వేసి కలుపుకోవాలి. మిగిలిన నూనెని వేడిచేసి అందులో ఇంగువ వేసి దొండకాయలపై పోయాలి. ఆవపిండి కాయలకు పట్టేలా బాగా కలుపుకుని ఒక గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. అంతే నోరూరించే దొండ‌కాయ ఆవ‌కాయ రెడీ. మూడవ రోజున తీసుకుని వేడి వేడి రైస్‌తో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: