పరువు హత్యలు ఎక్కువ అవుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎంత కాదు అనుకున్న సరే నెలకు ఒకటి అయినా పరువు హత్య జరుగుతుంది. కాలాలు మారుతున్నాయి కానీ కుల వివక్ష తగ్గడం లేదు. ఇంకా అలాంటి పరువు హత్యే తెలంగాణలోని గద్వాల్ లో చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఆ యువతి తనకంటే తక్కువ కులానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పది గర్భం దాల్చిందని తెలిసి తల్లితండ్రులు ఆగ్రహానికి గురయ్యా అబార్షన్ చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు కానీ అందుకు ఆమె అంగీకరించకపోవడంతో రాత్రికి రాత్రి దారుణంగా హతమార్చారు.

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో మానవపాడు మండలం కల్లుకుంట్లకు చెందిన భాస్కర శెట్టి, వీరమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇంకా అందులో ఓ కుమార్తె ఏపీలోని కర్నూలు పట్టణంలో ఓ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. అయితే అక్కడే ఆమెతో పాటు చదివే ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. 

 

కానీ అతను ఆమె కంటే తక్కువ కులం. ఇంకా అతనితో ప్రేమలో ఉన్న ఆమె లాక్ డౌన్ కారణంగా  ఆ యువతీ కర్నూల్ నుండి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన కూతురులో శారీరక మార్పులు రావడం గమనించిన తల్లి వీరమ్మ ఆమెను జూన్ 6వ తేదీ విద్య చికిత్స్ నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఇంకా ఆమెను పరిశీలించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్దారించారు. 

 

దీంతో విషయం తెలుసుకున్న తల్లితండ్రులు అబార్షన్ చేయించుకొవాలి అని ఒత్తిడి చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆ తల్లితండ్రులు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. శనివారం రాత్రి భోజనం తర్వాత రోజులానే ఇద్దరు కుమార్తెలతో కలిసి బయట నిద్రపోయారు. ఇంకా బాధితురాలైన మూడో కుమార్తె ఇంట్లోనే నిద్రిస్తుంది. 

 

అయితే చంపాలి అని నిర్ణయం తీసుకున్న తల్లి తండ్రులు రాత్రి రెండు గంటల సమయంలో ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోకి వెళ్లి గాఢ నిద్రలో ఉన్న తమ కుమార్తెను ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆతర్వాత ఏమి తెలియనట్టు ఎప్పటిలాగే ఆరుబయట నిద్రించారు. ఉదయంకు కూతురు గుండె నొప్పితో మరణించింది అని కన్నీరు కార్చారు. అయితే బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యదు చెయ్యగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితులను ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: