అందుకే ఈ నాటు బాంబులంటే జనాలు భయబ్రాంతులకు గురవుతుంటారు. అయినా నేటి కాలంలోనూ నాటుబాంబులను ఎవరు తయారుచేస్తారమ్మా అంటూ తేలిగ్గా ఈ వార్తలను కొట్టిపడేస్తుంటారు ఏం చేస్తాం.. కానీ తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లాలో ఈ నాటు బాంబులు బయటకొచ్చి కలకలం రేపుతున్నాయి. ఓ ముఠా వీటిని తయారు చేసినట్టు పోలీసులు వెళ్లడిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను హతమార్చేందుకే ఈ నాటుబాంబులను తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ముఠాలోని ఆరుగురి వ్యక్తులను ఆరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ ఆరుగురి నుంచి 23 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు . అయితే ఇదే కాకుండా మూడు రోజుల కిందట కూడా ఇదే జిల్లాలో నాటు బాంబులు తయారీ వ్యవహారం బయటకొచ్చింది.
అయితే రాప్తాడు నియోజకవర్గంలోని కనగాపల్లి మండలంలో కొందరు వ్యక్తులు ఈ నాటుబాంబులను తయారుచేస్తున్నారన్న సమాచారంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే మళ్లీ ఈ జిల్లాలో నాటు బాంబులు బయటపడ్డాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అరెస్టు చేస్తున్నారు. ఈ నాటుబాంబులు తయారు చేసి ఎవరిని చంపడానికి ప్లాన్ వేసారోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ బాంబులు బయటపడటంతో అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.