అక్రమ సంబంధాలు ఎంత అనర్థానికి దారి తీస్తాయో చాటే మరో ఘటన ఒకటి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. భర్తను ప్రియుడితో కలిసి చంపి, అప్పుల బాధ అంటూ అందర్నీ నమ్మించింది. అంత్యక్రియలు పూర్తయిన 18 రోజులకు కొడుకు ద్వారానే నిజం తెలియడంతో గుట్టు మొత్తం బయటికి వచ్చింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కొరటికల్‌లో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన కురుపాటి అనిల్‌(32) రోజు వారి కూలీ. ఇతనికి పదేళ్ల క్రితం అరుణతో వివాహమైయింది. వారికి ముగ్గురు కుమారులు. భార్య అరుణ అదే గ్రామానికి చెందిన అడెపు రాంబాబుతో వివాహేతర సంబంధం నెరుపుతోంది.


ఈ నెల 8వ తేదీన అనిల్‌ కూలి పనికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి అరుణ రాంబాబు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో ఆమెతో గొడవపడి భోజనం చేసి నిద్రపోయాడు. భర్త తనను తిట్టడాన్ని అరుణ భరించలేకపోయింది. అతడిని చంపేద్దామని అదే రాత్రి నిశ్చయించుకుంది. రాత్రి 12 గంటల సమయంలో ప్రియుడు రాంబాబును ఇంటికి పిలిపించుకుంది. అప్పటికే గాడ నిద్రలో ఉన్న అనిల్‌ మొహంపై రాంబాబు దిండు అదిమి పట్టాడు. అరుణ తన భర్త అనిల్‌ మర్మాంగాలను ఒత్తి పగలగొట్టేసింది.


చంపేశాక తిరిగి ఏమీ తెలియనట్టు రాంబాబు తన ఇంటికి వెళ్లిపోయాడు. అరుణ మృతదేహం పక్కనే పెట్టుకొని ఆ రాత్రి నిద్రపొయి పొద్దున్నే ఏమీ తెలియనట్లు నటించింది. ఇంతలో పిల్లలు నాన్న లేవడం లేదని తాత, నాన్నమ్మలకు చెప్పారు. వారు వెళ్లి చూస్తే చనిపోయినట్లుగా గుర్తించారు. అరుణ కూడా అందరితో కలిసి ఏడ్చింది. అప్పులబాధతో మత్తు మాత్రలు వేసుకుని చనిపోయి ఉంటాడని నమ్మించింది. అదేరోజు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. తండ్రిని తల్లి చంపిన ఘటనను వీరి పెద్ద కుమారుడు రాఘవేంద్ర చూశాడు. ఆ విషయాన్ని అప్పుడే కుటుంబ సభ్యులకు చెబుతానని తల్లితో అన్నాడు. చెప్తే మీ నాన్న లాగానే నిన్ను కూడా చంపేస్తానని తల్లి బెదిరించింది. అప్పటినుంచి తన కొడుకు ఎవరి వద్దకూ వెళ్లకుండా జాగ్రత్త పడింది. అయితే ఈ నెల 25న అరుణ పని నిమిత్తం మునుగోడుకు వెళ్లిన సమయంలో బాలుడు తాత, నానమ్మలకు జరిగిన విషయాన్ని చెప్పేశాడు. పోలీసులు అరుణను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: