కాళ్లు కట్టేసి, కొన్నిటికి మూతికి అడ్డంగా గుడ్డ కట్టేసి ఉన్న వాటిని బంధ విముక్తం చేశారు. ఇదేదో మేకల కిడ్నాప్లా ఉన్నట్లుందే అనుకుంటున్నారా?!..అయితే ఎస్ఐ రాజశేఖర్ చెప్పిన వివరాల ప్రకారం .. మేకను కారులో తరలిస్తున్నట్లు తెలిపారు.చిత్తూరు-అరగొండ రోడ్డులోని హైవే బ్రిడ్జి దగ్గర పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. ఒక స్విఫ్ట్ జైర్ కారులో 12 మేకలు ఉండటం చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన అనేక అనుమానాలకు దారి తీస్తుంది.
దీంతో కారు లో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఒక స్విఫ్ట్ జైర్ కారులో 12 మేకలు పైవిధంగా ఉండటం చూసి అనుమానించారు. కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే వీళ్లు తిరుపతి శెట్టిపల్లెకు చెందిన టి.గిరి, పుల్లిచెర్ల మండలం ముతుకువారిపల్లెకు చెందిన భూపతి అలియాస్ కట్టప్ప, బంగారుపాళెం మండలం డీకే వూరుకు చెందిన కె.జ్యోతినాథ్, ఇందిరమ్మకాలనీకి చెందిన కె.భరత్ అని, వీరంతా మేకల దొంగలని, దొంగలించిన మూగజీవాలను అమ్మేందుకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16న మండలంలోని మడవనేరిలో శివాజి, అజయ్కు చెందిన ఐదు మేకలు, ఈచనేరిలో కృష్ణయ్య చెందిన ఒక పొట్టేలు, ఒక గొర్రెను చోరీ చేసింది వీళ్లేనని వెల్లడైంది. వీళ్ల నుంచి రాబట్టిన సమాచారంతో నిందితుల ఇళ్ల నుంచి మరో 4 మేకలు, 4 పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి