పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సింది పోయి వివాహేతర సంబంధాలతో కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని కాపురాన్ని చేజేతులారా నాశనం చేసుకోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. నిండు నూరేళ్లు కలిసుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరిచి, క్షణిక సుఖం కోసం జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

ఇక వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోవడం, హత్యలకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇక ఆటో డ్రైవర్‌ తో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఆమెతో పాటు భర్త, ప్రియుడి ఆత్మహత్యలకు కారణమైంది. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టులో శనివారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెంగల్పట్టు కైలాసనాథర్ ఆలయం వీధికి చెందిన గోపి, తన భార్య కన్నియమ్మాళ్‌ తో జీవనం సాగిస్తున్నాడు. ఈ దంపతులకు 16 ఏళ్ల కూతురు కూడా ఉంది. సురేష్ మాంసం దుకాణం నడుపుతూ జీవనం సాగించేవాడు. అయితే కొంతకాలంగా కన్నియమ్మాళ్‌ కు అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ సురేష్‌(45) వివాహేతర సంబంధం కొనసాగుతుంది. భార్య ఎఫైర్ గురించి తెలుసుకున్న గోపి ఆమెను తీవ్రంగా మందలించాడు. ఇక ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవ కూడా జరిగింది. అయితే శనివారం గోపి, కన్నియమ్మాళ్ దంపతులు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆటో డ్రైవర్ సురేష్‌ ను విచారించాలని పోలీసులు భావించారు. అయితే అప్పటికే సురేష్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సురేష్ భార్య భార్య, ముగ్గురు కూతుళ్లు దిక్కులేని వారయ్యారు. మరోవైపు గోపి, కన్నియమ్మాళ్‌ కూతురు కూడా అనాథగా మారింది. క్షణికావేశంతో వాళ్ళు చేసే పనుల వలన పిల్లల నిండు జీవితాలు నాశనం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: