రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సరికొత్త చట్టాలను తీసుకు వస్తున్నాయి. కానీ అటు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మాత్రం ఎక్కడ ఆగడం లేదు. దీంతో రోజురోజుకీ ఆడపిల్లల కాలు బయట పెట్టాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఈ భూమ్మీద ఆడపిల్లగా పుట్టి పాపం చేశాము అని ప్రతి ఒక ఆడపిల్ల బాధ పడే పరిస్థితి నేటి సమాజంలో నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఒక అత్యాచార ఘటన గురించి మరవకముందే ఇంకో అత్యాచార ఘటన వెలుగులోకి వస్తు సంచలనంగా మారిపోతుంది.



  ఇటీవలి కాలంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. అయితే ప్రభుత్వం నేర నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ అటు కామాంధులు మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.  ఎన్ని కఠిన చట్టాలను తీసుకొచ్చినా కామందుల తీరులో మాత్రం మార్పు రావడం.  చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుని ఆడపిల్లలపై అత్యాచారం చేసిన ఏం కాదు అనే ధైర్యంతో ఉంటున్నారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన సంచలనం గా మారిపోయింది. ఈ ఘటన గురించి మరవకముందే  ఇప్పుడు మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ జిల్లాకు చెందిన ఒక మహిళను ఇద్దరు దుండగులు రేప్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన సదరు మహిళ ఇక ప్రతిఘటించింది. అంతేకాదు వారితో ఘర్షణ పడి ఇద్దరిని కూడా చెప్పుతో కొట్టింది. అయితే ఇక మహిళా చెప్పుతో కొట్టడంతో అవమానంగా ఫీలయ్యారు కామాంధులు. ఈ క్రమంలోనే ఏకంగా సిగరెట్ లైటర్ తో తమ దగ్గర ఉన్న కత్తిని వేడి చేసి ఇక ఆ మహిళల్లో పొడిచారు.దీంతో ఆ మహిళ రెండు కాళ్ళు కోల్పోయింది. అయితే ఎంత బ్రతిమిలాడి నప్పటికీ దుండగులు మాత్రం వదిలిపెట్టలేదు అంటూ ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది మహిళా.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: