కానీ ఇటీవలి కాలంలో మాత్రం కొంతమంది నీచులు తండ్రీ కూతుర్ల మధ్య ప్రేమ బంధానికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సొంత కూతురు అన్న ఆలోచన కూడా లేకుండా విచక్షణ మరచి ప్రవర్తిస్తున్నారు. దారుణంగా కన్నకూతురిపైనే అత్యాచారం చేస్తున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తున్నాయి. ఇలా కన్నతండ్రి అత్యాచారం చేస్తుంటే ఇక తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక దీన స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆడపిల్ల. ఇలా నేటి రోజుల్లో సభ్యసమాజం తలదించుకునే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇక్కడ ఓ దుర్మార్గుడు ఇలాంటి అరాచకానికి పాల్పడ్డాడు. తనకు ఇష్టం లేకుండా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఇక్కడొక తండ్రి. అంతటితో ఆగకుండా అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. యువతి ఏడాది క్రితం తండ్రికి ఇష్టం లేకుండా ప్రేమించిన యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. అయితే కూతురు కులాంతర వివాహం తర్వాత తండ్రిని కులం నుంచి కుల పెద్దలు అందరూ బహిష్కరణ చేశారు.. ఇకపోతే ఇటీవలె కూతురి కుమారుడు అనారోగ్యంతో చనిపోవడంతో అంత్యక్రియలు చేద్దాం అంటూ మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకెళ్లాడు. తర్వాత అత్యాచారం చేసి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.